ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Top news: ప్రధాన వార్తలు@3pm

.

By

Published : Dec 15, 2021, 3:01 PM IST

top news @3pm
top news @3pm

  • ఘోర ప్రమాదం..వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు.. 9 మంది మృతి

Bus accident: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం పరిధిలో జల్లేరు వద్ద ఆర్టీసీ బస్సు వాగులో పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఏపీ నుంచి తెలంగాణకు రిలీవ్‌ అయిన ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట

relaxation to employees: ఆంధ్రప్రదేశ్​ నుంచి తెలంగాణకు రిలీవ్‌ అయిన 12 మంది ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వారికి 3 వారాల్లోపు పెండింగ్ జీతాలు చెల్లించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అలాగే సర్వీసు బ్రేక్‌ లేకుండా క్రమబద్ధీకరించాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఏటీఎంలో రూ.4.95 లక్షలు నగదు తేడా...అనుమానం వచ్చి పరిశీలిస్తే..

DCC Bank ATM Robbery: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని డీసీసీ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో చోరీ జరిగింది. ఏటీఎంలో నగదు పెట్టేందుకు వెళ్లిన సిబ్బందికి లెక్కల్లో తేడా కనిపించింది. అనుమానం వచ్చి సీసీ టీవీ ఫుటేజ్​ను పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సినిమా టికెట్ల ధరలపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా

AP High Court adjourned On Movie ticket Price Case: సినిమా టికెట్ల ధరలు.. సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించిన ప్రభుత్వం.. విచారణ రేపటికి వాయిదా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Varun Singh: మృత్యువుతో పోరాడి ఓడిన గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​

Varun Singh: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో గాయపడ్డ గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సొంత చెల్లినే వివాహమాడిన అన్న.. ఎందుకంటే?

Brother Married His Sister: సొంత చెల్లినే వివాహం చేసుకున్నాడు ఓ అన్న. ఈ పెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి సామూహిక వివాహాల్లో జరగడం గమనార్హం. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ ఫిరోజాబాద్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Kenya Drought: మూగజీవాల మృత్యుఘోష- చుక్కనీరు లేక అల్లాడిపోయి..

Kenya Drought: కెన్యాలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. తాగేందుకు చుక్కనీరు లేక వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి. ఎక్కడికక్కడే కుప్పకూలి విగతజీవులుగా మారిపోతున్నాయి. ప్రాణాలు కోల్పోయి గుంపులు గుంపులుగా పడి ఉన్న జిరాఫీల దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అంచెలంచెలుగా ఎదిగి.. ఇప్పుడు 'షునెల్'​ సీఈఓగా భారతీయురాలు

Chanel Global CEO: ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలకు భారతీయులు వరుసగా సీఈఓలుగా ఎంపికవుతున్నారు. ఇటీవల సోషల్​ మీడియా దిగ్గజం ట్విట్టర్​ సీఈఓగా పరాగ్ అగర్వాల్​ పగ్గాలు చేపట్టగా.. తాజాగా భారత సంతతికే చెందిన లీనా నాయర్​(52) ఈ జాబితాలో చేరారు. షునెల్​ గ్లోబల్​ సీఈఓగా ఆమె నియామకం అయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సరైన సమాచారం లేకుండా కెప్టెన్సీ నుంచి తొలగించారు'

Virat Kohli ODI Captaincy: దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు మీడియాతో మాట్లాడిన టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఫ్లాప్​లతో డిప్రెషన్​లోకి వెళ్లా.. చిరు అండతోనే మళ్లీ ఇలా'

Alitho Saradaga Actors Srikanth and Poorna: వరుస ఫ్లాప్​లతో ఒకానొక సందర్భంలో డిప్రెషన్​లోకి వెళ్లిపోయి సినీఇండస్ట్రీకి దూరంగా ఉండాలని తాను నిశ్చయించుకున్నట్లు తెలిపారు శ్రీకాంత్​. కానీ ఆ తర్వాత చిరంజీవి చెప్పిన కొన్ని మాటలు తనలో స్ఫూర్తి నింపాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details