సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు... అన్న నినాదంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ.... నేటితో 37 ఏళ్లు పూర్తిచేసుకొని..38వ వసంతంలోకి అడుగుపెట్టింది. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో నందమూరి తారక రామారావు 1982 మార్చి 29వ తేదీన పార్టీని స్థాపించారు. ఈ సుదీర్ఘ కాలంలో ఎన్నో చారిత్రక ఘట్టాలు, సవాళ్లూ, సంక్షోభాలనూ పార్టీ చవిచూసింది.
కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ ప్రకటించినందున ఈసారి నేతలంతా ఇళ్లలోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోనున్నారు. ఇళ్లపై తెలుగుదేశం జెండాలు ఎగరేసి ఎన్టీఆర్ చిత్రపటాల వద్ద నివాళులు అర్పించాలని అధినేత చంద్రబాబు సూచించారు. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆదేశించారు.