ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్ర మంత్రివర్గంలో గౌడ సామాాజిక వర్గానికి స్థానం కల్పించాలి' - విజయవాడ వార్తలు

రాష్ట్ర మంత్రివర్గంలో గౌడ సామాజిక వర్గానికి స్థానం కల్పించి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్​ను కోరారు.

krishna distrct
'రాష్ట్ర మంత్రివర్గంలో గౌడ సామాాజిక వర్గానికి స్థానం కల్పించాలి'

By

Published : Jul 18, 2020, 6:21 PM IST

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గ విస్తరణలో గౌడ సామాజిక వర్గానికి చెందిన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కు స్థానం కల్పించి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం ప్రతినిధులు కోరారు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా జనాభా కలిగి బీసీ కులాల్లో ప్రాముఖ్యత కులంగా గౌడ సామాజిక వర్గం ఉందన్నారు. తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చి తమ ప్రతినిధి జోగి రమేష్ కు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని.. గౌడ సామజిక వర్గానికి అండగా నిలవాలని కోరారు. కష్ట నష్టాల్లో పార్టీ వెన్నంటే ఉన్న జోగి రమేష్ వంటి వైద్యులకు సముచిత స్థానం కల్పించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details