'సంస్కృతి పరిరక్షణకు మాతృభాష మాధ్యమం కొనసాగాలి' - mlcs protest at vijayawada The language of the mother tongue must be continued in governament schools
ఇంగ్లీష్ బోధనతోపాటు మాతృభాష మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలని కొరుతూ విజయవాడలో నిరసన దీక్ష నిర్వహించారు. ధర్నాచౌక్ లో మాతృభాష మాధ్యమ వేదిక పేరుతో కార్యక్రమం చేపట్టారు. మాతృభాష పరిరక్షణ సమితి సభ్యులు, మేధావులు, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ సంఘల నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సర్కారీ పాఠశాలలో ప్రవేశపెట్టనున్న ఇంగ్లీష్ బోధనతోపాటు మాతృభాష మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలని కొరుతూ విజయవాడ ధర్నాచౌక్ లో మాతృభాష మాధ్యమ వేదిక పేరుతో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ మాతృభాష పరిరక్షణ సమితి సభ్యులు, మేధావులు, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ సంఘల నాయకులు పాల్గొన్నారు. ఆంగ్లమాధ్యమంతోపాటు మాతృభాష మాధ్యమాన్ని కొనసాగించాలని కోరారు. వివిధ రంగాలలో ఉపాధి, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఆంగ్ల మాధ్యమం అవసరమైనప్పటికీ... మన సంస్కృతి పరిరక్షించుకోవడానికి తప్పనిసరిగా మాతృభాష మాధ్యమం కొనసాగించాల్సిందేనన్నారు.