స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగానే 60 లక్షల రేషన్ కార్డులు తొలగించేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. ఒకే దేశం ఒకే రేషన్ విధానం అమలు కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభించిన నెలరోజుల వ్యవధిలో 9 లక్షల కార్డులు తొలగించారని ఆరోపించారు.
"జాతీయ ఆహార భద్రత వెబ్సైట్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య 88,16,875. నవంబరు వరకు రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డులు 1 కోటి 52లక్షలు. డిసెంబరులో దాదాపు 9 లక్షల కార్డులు తొలగించి రేషన్ కార్డుల సంఖ్యను 1 కోటి 44 లక్షలకు తీసుకొచ్చారు. కేంద్ర వెబ్సైట్లో ఉన్న లెక్క ప్రకారం 88 లక్షలకే రేషన్ కార్డులను పరిమితం చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఆ ప్రకారం 60 లక్షల కార్డులను తొలగిస్తే కేంద్రమే రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి భారం లేకుండా ఉచిత బియ్యం అదిస్తుంది. ఈ చర్య ద్వారా 16 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన పౌరసరఫరాల కార్పొరేషన్పై భారం తగ్గించుకోవటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3700 కోట్లు మిగలనుంది. 2 శాతం ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచుకోవటానికి కేంద్రం పెట్టిన షరతుల్లో రేషన్ కార్డుల తొలగింపు ఒకటి. ఇందులో భాగంగా రూ.20వేల కోట్ల అప్పు తెచ్చుకునేందుకు విద్యుత్ సంస్కరణలు, రేషన్ తొలగింపు, ఆస్తిపన్ను షరతులకు అంగీకారం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వేయించుకునే వరకూ మాయమాటలు చెప్పి ఆ తర్వాత 60లక్షల కార్డులు తొలగించనున్నారు." -కొమ్మారెడ్డి పట్టాభిరామ్, తెదేపా అధికార ప్రతినిధి
ఇప్పటికే 1,120కోట్ల భారం