ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చంద్రబాబు విశాఖ ప్రసంగాన్ని వక్రీకరించడం సిగ్గుచేటు' - vijayawada latest news

వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అబద్ధాలతో విశాఖ ఉక్కు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని... తెలుగు రైతు సంఘం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు విశాఖ ప్రసంగాన్ని వక్రీకరించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.

srinivasareddy
'చంద్రబాబు విశాఖ ప్రసంగం వక్రీకరించడం సిగ్గుచేటు'

By

Published : Feb 17, 2021, 9:59 PM IST

అంబటి రాంబాబు అబద్ధాలు, మోసాలతో విశాఖ ఉద్యామాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని... తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆయన తన నోటికి తప్ప మెదడుకు పనిచెప్పట్లేదని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై చెప్పే అబద్ధాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. చంద్రబాబు విశాఖ ప్రసంగాన్ని వక్రీకరించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని శ్రేణులను కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details