ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయవాడలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

విజయవాడ పండిట్ నెహ్రు బస్టాండ్ ఆవరణలో తెరాస ఆంధ్రప్రదేశ్ నాయకులు ఆదినారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలను పంపిణీ చేశారు.

By

Published : Jun 2, 2020, 2:51 PM IST

Published : Jun 2, 2020, 2:51 PM IST

విజయవాడలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
విజయవాడలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సంవత్సరానికో సంచలన కానుకలను తెలంగాణ ప్రజలకు అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెరాస ఆంధ్రప్రదేశ్ నాయకులు ఆదినారాయణ అన్నారు. విజయవాడ పండిట్ నెహ్రు బస్టాండ్ ఆవరణలో కేక్ కట్​ చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. కొండ పోచమ్మకు గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తరలించి పంట పొలాలకు నీరందించారన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలను పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details