ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 10, 2021, 1:06 PM IST

ETV Bharat / city

రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ సీఎం కేసీఆర్​ చిత్రపటానికి పాలభిషేకం

ఏపీ సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కు తీసుకునేందుకు అంగీకరిస్తూ తీసుకున్న నిర్ణయంపై వారంతా హర్షం వ్యక్తం చేశారు.

ఏపీ సచివాలయంలో కేసీఆర్​ చిత్రపటానికి పాలభిషేకం
ఏపీ సచివాలయంలో కేసీఆర్​ చిత్రపటానికి పాలభిషేకం

ఏపీ సచివాలయంలో కేసీఆర్​ చిత్రపటానికి పాలభిషేకం

తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండి... రాష్ట్ర సచివాలయ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు.. కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సచివాలయం సహా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల్ని వెనక్కు తీసుకునేందుకు కేసీఆర్ అంగీకరిస్తూ ఫైలుపై సంతకం చేయటంపై వారంతా హర్షం వ్యక్తం చేశారు.

ఈ మేరకు వారంతా వేడుక చేసుకున్నారు. సచివాలయంతో పాటు హెచ్ఓడీ కార్యాలయాల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన 700 మంది ఉద్యోగులు రాష్ట్రంలో పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు.. వారందరినీ ఏపీ ప్రభుత్వం త్వరలోనే రిలీవ్ చేసే అవకాశం ఉంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details