teachers protest రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసనలు కొనసాగుతున్నాయి . సోమవారం నుంచి శుక్రవారం వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు రానున్నట్లు టీచర్లు తెలిపారు. ఫ్యాప్టో ప్రతినిధులు శుక్రవారం కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వనున్నారు. దశలవారీ పోరాటాలకు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్యంగా పిలుపునిచ్చారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలోని 12 సంఘాలు నిరసనల్లో పాల్గొంటున్నాయి. పీఆర్సీ ఫిట్మెంట్పై ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఫిట్మెంట్ 27 శాతం ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. సీపీఎస్ రద్దుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
teachers protest: శుక్రవారం వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు.. - ఉపాధ్యాయుల నిరసన వార్తలు
teachers protest in ap: రాష్ట్రంలో ఉపాధ్యాయుల నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు రానున్నట్లు టీచర్లు తెలిపారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలోని 12 సంఘాలు నిరసనల్లో పాల్గొంటున్నాయి. హెచ్ఆర్ఏ కనీస శ్లాబు 12 శాతానికిపైగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
![teachers protest: శుక్రవారం వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు.. teachers protest in andhra pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14402737-508-14402737-1644293603633.jpg)
ఉపాధ్యాయుల నిరసనలు