ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 26, 2021, 2:56 PM IST

ETV Bharat / city

ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు: అచ్చెన్నాయుడు

TDP Leader Atchannaidu on omicron cases in AP: ఒమిక్రాన్ కేసుల కట్టడిలో ఇతర రాష్ట్రాలు ముందుంటే.. వైకాపా ప్రభుత్వం మాత్రం కక్షసాధింపులో ముందంజలో ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.

Tdp state president Kinjarapu Atchannaidu
తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

TDP state president Atchannaidu on AP omicron cases: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రజల ప్రాణాలకంటే.. కక్షసాధింపు చర్యలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. వ్యాక్సినేషన్​లో ఏపీ వెనకబడి ఉందని అచ్చెన్న ఆవేదన వ్యక్తంచేశారు.

Atchannaidu on omicron cases: ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు శూన్యమన్న అచెన్న.. వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చేసే మొక్కుబడి సమీక్షలతో వచ్చే ప్రయోజనం ఏంటని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details