ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 25, 2021, 9:30 PM IST

ETV Bharat / city

'భాజపా నేతపై దాడి ఘటనలోకి తెదేపాను లాగొద్దు'

భాజపా నేత విష్ణువర్దన్ రెడ్డిపై జరిగిన దాడిలోకి తెదేపాను లాగొద్దని ఆ పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు అన్నారు. భౌతిక దాడులు, కుట్ర రాజకీయాలు ఏ పార్టీ సిద్ధాంతాలో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు.

pilli manikyalarao on bjp leader attack
'భాజపా నేతపై దాడిలోకి తెదేపాను లాగొద్దు '

భాజపా నేత విష్ణువర్దన్ రెడ్డిపై జరిగిన దాడిని తెదేపాకు అంటకట్టాలని చూడొద్దని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు అన్నారు. భౌతిక దాడులు, కుట్ర రాజకీయాలు, విధ్వంసకర నిర్ణయాలు ఏ పార్టీ సిద్ధాంతాలో అందరికీ తెలుసని మండిపడ్డారు. ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత విమర్శల మధ్య జరిగిన ఘర్షణలో తెదేపాను నిందించడం సరికాదన్నారు.

ఇటీవల ఓ ఛానెల్ నిర్వహించిన చర్చ సందర్భంగా అమరావతి పరిరక్షణ ఐకాస కన్వీనర్ శ్రీనివాస్, విష్ణువర్థన్ రెడ్డిపై దాడి చేశారు.

ఇదీ చదవండి:కొత్తవలస ఫలితం అవకతవకపై ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details