ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్ వినతిపత్రాలకు ప్రధాని స్పందన ఏమిటో చెప్పాలన్న ఎంపీ కనకమేడల

జగన్ వినతిపత్రాలకు ప్రధాని స్పందన ఏమిటో చెప్పాలని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. సీఎం జగన్‌ ఇప్పటివరకు 30 సార్లు దిల్లీకి వచ్చి ఐదు సార్లు ప్రధాని మోదీని కలిశారన్నారు. ఏ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు అడిగారో సీఎం జగన్ చెప్పాలన్నారు.

By

Published : Aug 22, 2022, 9:58 PM IST

ప్రధాని స్పందన ఏమిటో చెప్పాలన్న ఎంపీ కనకమేడల
ప్రధాని స్పందన ఏమిటో చెప్పాలన్న ఎంపీ కనకమేడల

దిల్లీ పర్యటన వివరాలు చెప్పాలని సీఎం జగన్‌ను కోరుతున్నట్లు తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. ఏ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు అడిగారో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్‌ ఇప్పటివరకు 30 సార్లు దిల్లీకి వచ్చి ఐదు సార్లు ప్రధాని మోదీని కలిశారన్నారు. ప్రధానికి విన్నవించిన వివరాలు.., ప్రధాని స్పందన తెలియజేయాలన్నారు. జగన్ వినతిపత్రాలు పీఎంవోలో ఏ స్టేజ్‌లో ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఫైల్స్ నెంబర్లు చెబితే తాము కూడా కేంద్రమంత్రుల వెంటపడతామన్నారు. సీఎం జగన్ రాసిన లేఖల వల్లే పోలవరం పనుల్లో జాప్యం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఈ మూడేళ్లలో పెట్టిన ఖర్చు ఎంత? అని ప్రశ్నించారు. 'జగన్‌ది.. రివర్స్ టెండరింగే కాదు.. రివర్స్ పాలన కూడా..' అంటూ ఎద్దేవా చేశారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో ఇప్పటికీ చెప్పటం లేదని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details