జనాన్ని మోసం చేసే జగన్ మోహన్ రెడ్డి మరోసారి రాష్ట్రాన్ని దగా చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు ఇవ్వని కేంద్రాన్ని ఏమీ అనలేని నిస్సహాయస్థితిలో జగన్ రెడ్డి ఉన్నారన్నారు.
"25 మంది ఎంపీలనిస్తే కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా సాధిస్తానని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారు. తన 31 కేసుల నుంచి తప్పిస్తే ప్రత్యేక హోదా ఊసెత్తనని 28 ఎంపీలను కేంద్రానికి తాకట్టు పెట్టారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన హామీలకు బాబాయ్ హత్య కేసుతో కేంద్రం చెల్లు చేసింది. బడ్జెట్లో నిధులు కేటాయించక్కర్లేదు కానీ...సహనిందితులైన అధికారులను తనకు కేటాయిస్తే చాలని కేంద్రం వద్ద సాగిలపడ్డారు. అప్పులు వాడుకోవడానికి అనుమతిస్తే చాలు, ఏ ప్రాజెక్టులివ్వకపోయినా ఫర్వాలేదని ఒప్పందం చేసుకున్నారు." అని ట్విటర్ వేదికగా లోకేశ్ దుయ్యబట్టారు.
కాళ్ళు పట్టేది, కాకా పట్టేది కేసుల మాఫీ కోసమే..
"ప్రధాని మోదీ వెనకాల కూర్చున్న గొప్పవాడిని అంటూ పీఆర్ టీంతో డబ్బాలు కొట్టుకుంటే...రాష్ట్రం కోసం భారీగా నిధులు తేవటానికి ఆయన వెనకాల కూర్చుని దువ్వుతున్నావ్ అనుకున్నాం. నువ్వు కాళ్ళు పట్టేది, కాకా పట్టేది, నీ కేసులు కోసం అని ఈరోజుతో తేలిపోయింది. కేంద్ర బడ్జెట్లో, రాష్ట్రానికి కనీసం రూపాయి తీసుకుని తేలేని నువ్వు, నీ ఎచ్చు కబురులు ఎందుకు ? 22 మంది ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు కలిసి మీ కేసుల కోసం ఏపీని అమ్మేసారా ఏంటి ?" -అయ్యన్నపాత్రుడు
ఏపీకి మెట్రో ఊసే లేదు