ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 11, 2019, 11:57 AM IST

ETV Bharat / city

'ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి'

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించి ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

TDP Leaders protest against RTC charges Hike
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఆందోళనలు

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఆందోళనలు

రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై గుంటూరులో ఎన్టీఆర్‌ బస్టాండ్‌ ఎదుట, మంగళగిరి పట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని నేతలు డిమాండ్ చేశారు. మాజీమంత్రి నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు, గంజి చిరంజీవి ఆందోళనలో పాల్గొన్నారు. విజయవాడలోనూ ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ... తెదేపా నేతలు ఆందోళన చేశారు. విజయవాడ శివారు గొల్లపూడి సెంటర్‌ నుంచి మైలవరం వరకు పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. పల్లె వెలుగు బస్సులో మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రయాణించారు.

ABOUT THE AUTHOR

...view details