ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 6, 2021, 4:07 PM IST

ETV Bharat / city

రాష్ట్రానికి 'వైఎస్​ వైరస్'​ పట్టింది.. అది 'నారా వ్యాక్సిన్' తోనే పోతుంది..!

రాష్ట్రంలో కరోనా తీవ్ర రూపం దాల్చి ప్రజల ప్రాణాలు బలిగొంటున్నా.. సీఎం జగన్​ సరిగా స్పందించడంలేదని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. టీకాల పంపిణీలో కమిషన్ల కోసమే ఆలస్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. మరణాల రేటు కావాలనే తక్కువచేసి చూపుతోంది ప్రభుత్వమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp leaders fired on cm jagan over corona
రాష్ట్రానికి 'వైఎస్​ వైరస్'​ పట్టిందంటూ తెదేపా నేతలు

"రాష్ట్రానికి సోకిన అతిపెద్ద ఏ1 వై(ర)ఎస్ 6093" అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. ఆయువు నిల‌బ‌డ‌టానికి వాయువు లేక, వైద్యం అందించే నాథుడు లేక, అంత్యక్రియ‌ల‌కు శ్మశానాల్లో ఖాళీలేక... రాష్ట్రాన్ని సీఎం జగన్​ శ‌వాల‌ దిబ్బగా మార్చారని మండిపడ్డారు.

"వైర‌స్‌కి వైఎస్‌కి మ‌ధ్యలో ఒక్క అక్షర‌మే తేడా ఉంది. వైర‌స్‌ని ఇంటి పేరులో పెట్టుకున్న జ‌గ‌న్‌రెడ్డి చర్యల వ‌ల్లే ఏపీలో కరోనా విజృంభిస్తోంది" అని ట్విట్టర్​లో మాజీ మంత్రి జవహర్​ అన్నారు. "ఫ్యాక్షన్ వైర‌స్ రాజారెడ్డి, పొలిటిక‌ల్ వైర‌స్ రాజ‌శేఖ‌ర్రెడ్డి, క‌రెప్షన్ వైర‌స్ జ‌గ‌న్ రెడ్డి" అనీ... వీటన్నింటికీ నారా వ్యాక్సినే క‌రెక్టని పేర్కొన్నారు.

వ్యాక్సిన్ల కొనుగోళ్లపై ప్రభుత్వ సలహాదారు సజ్జల చెప్పినవన్నీ కట్టుకథలేనని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ల కొనుగోలుకు ఆంక్షలు ఉన్నాయని సజ్జల పొంతనలేని సమాదానాలు చెబుతున్నారన్నారు. సంబంధించి ఆధారాలుంటే చూపాలన్నారు.

ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు కూడా అమ్ముకునే దుస్థితి రాష్ట్రంలో నెలకొందని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం కరోనా బాధితులతోపాటు మృతుల సంఖ్యను తక్కువగా చూపుతోందని ఆరోపించారు. గుంటూరు శ్మశానవాటికలో ఒక్కరోజే 50కి పైగా మృతదేహాలను ఖననం చేస్తే, రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించారని ఆగ్రహించారు.

ఇవీ చదవండి:

'ఉత్తర భారతాన్ని వణిస్తున్న బ్రిటన్ రకం వైరస్'

రాష్ట్రంలో ఎలాంటి కొత్త వైరస్ లేదు: మంత్రి పేర్ని నాని

ABOUT THE AUTHOR

...view details