ETV Bharat / city
మహిళల అరెస్టుపై ఎంపీ కేశినేని, దేవినేని ఉమ మెరుపు ధర్నా - ఎంపీ కేశినేని నాని అరెస్టు వార్తలు
విజయవాడ బందరు రోడ్డుపై ఎంపీ కేశినేని, దేవినేని ఉమ, ఇతర నేతలు మెరుపు ధర్నాకు దిగారు. నున్న పోలీస్ స్టేషన్ నుంచి వస్తూ రోడ్డుపై బైఠాయించారు. అరెస్ట్ చేసిన మహిళలను ఇప్పటి వరకు విడుదల చెయ్యలేదని నిరసన తెలిపారు. 8 గంటల వరకు పీఎస్లో మహిళలను ఎలా ఉంచుతారంటూ ప్రశ్నించారు. మహిళల వివరాలు తీసుకోవడంపై ఎంపీ కేశినేని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు ధర్నా చేస్తున్న నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తోట్ల వల్లూరు పీఎస్కి తరలించారు. తెదేపా నేతలను విడిచిపెట్టాలని కార్యక్రర్తలు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.
![]()
![మహిళల అరెస్టుపై ఎంపీ కేశినేని, దేవినేని ఉమ మెరుపు ధర్నా Tdp leaders dharna at bandar road](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5667407-1105-5667407-1578670653700.jpg)
మహిళలపై అరెస్టుపై ఎంపీ కేశినేని, దేవినేని ఉమ మెరుపు ధర్నా
By
Published : Jan 10, 2020, 9:31 PM IST
| Updated : Jan 10, 2020, 10:18 PM IST
మహిళల అరెస్టుపై ఎంపీ కేశినేని, దేవినేని ఉమ మెరుపు ధర్నా ఇదీ చదవండి:
Last Updated : Jan 10, 2020, 10:18 PM IST