ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 6, 2022, 10:51 AM IST

ETV Bharat / city

'అసహనం పక్కనపెట్టి పనిపై దృష్టి పెడితే...పరిస్థితులు మెరుగుపడతాయి'

TDP leaders on Naidupet incident: తిరుపతిలోనే సీఎం జగన్​ మాట్లాడుతుండగానే నాయుడుపేటలో అంబులెన్స్​ మాఫియా ఆగడాలు తాళలేక చిన్నారి మృతదేహాన్ని బైక్​పై తీసుకెళ్లారని నారా లోకేశ్​ అన్నారు. అసహనం పక్కన పెట్టి పనిపై దృష్టి పెడితే.. కాస్తయినా పరిస్థితులు మెరుగుపడతాయని హితవు పలికారు.

Lokesh
నారా లోకేశ్

TDP leaders on Naidupet incident: కుళ్లు, కుతంత్రాలతో తెదేపా దుష్ప్రచారం చేస్తుందని మాట్లాడటం వల్ల జగన్​, వైకాపా నాయకులకు ఆత్మసంతృప్తి కలగొచ్చేమో కానీ... ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ విమర్శించారు. తెదేపాపై సీఎం జగన్​​ అక్కసుతో మాట్లాడుతున్న సందర్భంలోనే అంబులెన్స్ మాఫియా ఆగడాలు తట్టుకోలేక తిరుపతి జిల్లా నాయుడుపేటలో రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని బైక్​పై సొంత ఊరికి తీసుకెళ్లాల్సి వచ్చిందని మండిపడ్డారు. ఆసుపత్రి సిబ్బంది సహకరించక, అంబులెన్స్ మాఫియా డిమాండ్ చేసిన డబ్బు లేక చిన్నారి అక్షయ మృతదేహాన్ని 18 కిలోమీటర్లు బైక్​పై తీసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితిని కల్పించింది.. వైకాపా ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. అసహనం పక్కన పెట్టి పనిపై దృష్టి పెడితే కాస్తయినా పరిస్థితులు మెరుగుపడతాయని లోకేశ్​ హితవు పలికారు.

ఇదీ చదవండి: తిరుపతిలో అమానవీయం.. మృతదేహం తరలింపునకు 108 నిరాకరణ.. బైక్‌పై తీసుకెళ్లిన తండ్రి

ABOUT THE AUTHOR

...view details