రాష్ట్రంలో రహదారులు అస్తవ్యస్థంగా మారాయంటూ తెలుగుదేశం ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల పేరిట అభివృద్ధిని విస్మరించారని.. గుంటూరులో తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. తెదేపా హయాంలో వేసిన రోడ్లు తప్ప ఈ ప్రభుత్వం ఒక్క కొత్త రోడ్డు కూడా వేయలేదని దుయ్యబట్టారు. అధికారంలో గోతులు తీసే నాయకులు ఉండి.. రహదారులకు పడిన గుంతలు పూడ్చటం లేదని గుంటూరులో మాజీమంత్రి ఆలపాటి రాజా ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో అభివృద్ధి ఆచూకీ లేకుండా పోయిందని.. కృష్ణా జిల్లా కైకలూరులో తెదేపా నేతలు ఆందోళన చేశారు. వీరులపాడు మండలం జూజ్జురులో రోడ్లపై గుంతలను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమ, నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే సౌమ్య, శ్రీరాంను పోలీసులు అడ్డుకుని.. పోలీస్స్టేషన్కు తరలిస్తుండగా.. తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతలోనే వైకాపా కార్యకర్తలు అక్కడికి చేరుకుని.. తెదేపా నేతలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి
పశ్చిమగోదావరి జిల్లా చింతపూడి మండలం రామచంద్రపురంలో అధ్వానంగా మారిన రహదారులకు స్వచ్ఛందంగా మరమ్మతు చేస్తున్న తెదేపా నేత చింతమనేని ప్రభాకర్ను పోలీసులు అడ్డుకున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోడ్లన్నీ చేపలు, రొయ్యలు చెరువుల మాదిరిగా మారాయని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. రెండేళ్లుగా రోడ్లపై మరమ్మతులు కూడా చేయని.. ప్రభుత్వాన్ని గద్దెదించాలంటూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో తెదేపా శ్రేణులు నినదించారు. జగన్ పాలనలో అవినీతి సంతలే.. రోడ్లంతా గుంతలే అంటూ.. చేపట్టిన కార్యక్రమంలో భారీ సంఖ్యలో శ్రేణులు పాల్గొన్నారు. ఒంగోలు నుంచి కర్నూలు వెళ్లే ప్రధాన రహదారి అస్తవ్యస్థంగా ఉందని.. తెదేపా నేతలు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.
సీఎం అభివృద్ధి అనే పదాన్ని మరిచారు