ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ట్రంప్​ను తలుచుకోగానే గుర్తొచ్చే వ్యక్తి.. సీఎం జగన్​: పట్టాభి

By

Published : Nov 8, 2020, 6:09 PM IST

డొనాల్డ్ ట్రంప్​ను తలుచుకోగానే రాష్ట్రంలో మనకు గుర్తొచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు. ట్రంప్​, జగన్మోహన్ రెడ్డికి మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

ట్రంప్​ను తలచుకోగానే గుర్తొచ్చే వ్యక్తి.. సీఎం జగన్​: పట్టాభి
ట్రంప్​ను తలచుకోగానే గుర్తొచ్చే వ్యక్తి.. సీఎం జగన్​: పట్టాభి

కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రపంచంలో ట్రంప్, జగన్మోహన్​రెడ్డి ఇద్దరు మాత్రమే మాస్క్​లు లేకుండా తిరిగారని తెదేపా నేత పట్టాభి అన్నారు. ట్రంప్ తన దేశంలో ఎందుకు లాక్ డౌన్ విధించాలి అంటే? జగన్ ఇక్కడ పారాసిట్మాల్, బ్లీచింగ్ పౌడర్​తో వైరస్ తగ్గుతుందన్నారని గుర్తు చేశారు. ఇద్దరూ ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ట్రంప్ పాలనలో అమెరికాలో జాత్యాహంకార దాడులు ఎక్కువయ్యాయన్న పట్టాభి... జగన్ ఏలుబడిలో రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని దుయ్యబట్టారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details