ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సంపద సృష్టించడం చేతకాక.. ప్రజలపై కరెంట్ ఛార్జీల బాదుడు'

ఎన్నికల సమయంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కరోనా లాంటి కష్ట సమయంలో వైకాపా ప్రభుత్వం ప్రజలపై కరెంట్ ఛార్జీల బాదుడు మొదలుపెట్టిందని తెదేపా నేత దేవినేని ఉమ విమర్శించారు.

By

Published : May 11, 2020, 12:34 PM IST

tdp leader devineni uma fires on ycp government
వైకాపా ప్రభుత్వంపై దేవినేని ఉమ విమర్శలు

సంపద సృష్టి చేతగాని వైకాపా ప్రభుత్వం.. లాక్ డౌన్ సమయంలో స్లాబుల రేట్లు రెట్టింపు చేసి కరెంట్ ఛార్జీల బాదుడు మొదలుపెట్టిందని మాజీమంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఛార్జీల మోత మోగిస్తున్నారన్నారు.

ఈ అన్యాయపు వసూళ్లని ఆపాలని డిమాండ్ చేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలపై ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పితీరాలన్నారు.

ఇవీ చదవండి.. నెల్లూరులోని రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details