ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 13, 2021, 4:15 PM IST

ETV Bharat / city

పేలుడు ఘటన విచారణను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది: చినరాజప్ప

కడప జిల్లాలో జిలెటిన్‌స్టిక్స్‌ పేలుడు ఘటన విచారణను ప్రభుత్వం కావాలనే పక్కదారి పట్టిస్తోందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. అసలు లీజుదారులను అరెస్ట్​ చేయకపోవడాన్ని తప్పుపట్టారు.

నిమ్మకాయల చినరాజప్ప
పేలుళ్ల ఘటన విచారణను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది

కడప జిల్లా మామిళ్లపల్లి పేలుడు ఘటనలో అసలు లీజుదారులైన ఎమ్మెల్సీ రామచంద్రయ్య కుటుంబసభ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిమ్మకాయల చినరాజప్ప నిలదీశారు. జరిగిన ఘటనలో మైనింగ్ అధికారుల వైఫల్యమూ ఉందని.. వారిని సస్పెండ్ చేసి, మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details