ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సింహాల ప్రతిమలు మంత్రి వెల్లంపల్లి ఇంట్లో వెతకాలి: అయ్యన్న

దుర్గమ్మ దేవస్థానంలోని వెండి రథంలోని మూడు సింహాల ప్రతిమలు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంట్లో వెతకాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. విగ్రహాలు మాయం కావడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

By

Published : Sep 16, 2020, 7:01 PM IST

tdp leader ayyanna comments on minister vellampalli
tdp leader ayyanna comments on minister vellampalli

మంత్రి వెల్లంపల్లి ఇంట్లో వెతికితే దుర్గ గుడిలో మాయమైన మూడు సింహాల విగ్రహాలు ప్రత్యక్షమవుతాయని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విగ్రహాలు మాయమవ్వడం బాధాకరమన్న ఆయన.. చోరీ జరిగిన విషయం స్పష్టంగా కనిపిస్తుంటే కొంతమంది మూర్ఖులు అసలు ఉన్నాయో? లేవో? అని, లాకర్​లో ఉన్నాయని, స్టోర్ రూంలో ఉన్నాయని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. వెతకాల్సింది లాకర్​లోనో, స్టోర్ రూమ్​లోనో కాదని, దుర్గమ్మ గుడికి కూతవేటు దూరంలో ఉన్న మంత్రి ఇంట్లోనని అయ్యన్న వ్యాఖ్యానించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details