ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 25, 2020, 4:30 PM IST

ETV Bharat / city

ఈ సమయంలో పాఠశాలలు తెరవాలనుకోవడమేంటి?: అనిత

రాష్ట్రంలో ప్రతి 100 మందిలో 15 మంది కరోనాకు గురవుతుంటే పాఠశాలలు తెరవాలనుకోవడం ఏంటని తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు.

ఈ సమయంలో పాఠశాలలు తెరవాలనుకోవడమేంటి?: అనిత
ఈ సమయంలో పాఠశాలలు తెరవాలనుకోవడమేంటి?: అనిత

గ్రామీణ, కొండ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉందని.. అలాంటి ప్రదేశాల్లో పాఠశాలలు తెరవాలనుకోవడం సరికాదన్నారు. ప్రచార పిచ్చితో పసివాళ్ల ప్రాణాలు తీయాలనుకుంటున్నారా? అని అనిత నిలదీశారు. పిల్లల యూనిఫామ్, స్కూల్​ బ్యాగులకు పార్టీ రంగు వేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి తప్ప ఎవరికీ రాదని విమర్శించారు. వ్యాక్సిన్ వచ్చే వరకు పాలకులు ఇలాంటి పిచ్చి పనులు మానుకుంటే మంచిదని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details