ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 12, 2021, 4:35 AM IST

Updated : Oct 12, 2021, 9:04 AM IST

ETV Bharat / city

PENDING BILLS: నీరు చెట్టు బిల్లుల్ని కక్షపూరితంగా నిలిపివేశారు: అచ్చెన్నాయుడు

నీరు చెట్టు బిల్లుల్ని వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా నిలిపివేసిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు(tdp leader achannaidu on neru chettu pending bill) మండిపడ్డారు. బాధితులకు అండగా నిలుస్తామని.. అందరికీ న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తాని స్పష్టం చేశారు.

achannaidu comments on neru chettu pending bills
నీరు చెట్టు బిల్లుల పెండింగ్​పై తెదేపా నేత అచ్చెన్నాయుడు ఫైర్

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన నీరు చెట్టు బిల్లుల్ని వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా నిలిపేసిందని(tdp leader achannaidu on neru chettu pending bill) తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రూ. 12,77 కోట్లును పెండింగ్​లో పెట్టడం వల్ల సన్న, చిన్న కారు రైతులు, నీటి సంఘాల ప్రతినిధులు అప్పులపాలయ్యారని ఆరోపించారు. బాధితుల(achannaidu on neru chettu pending bill)కు అండగా ఉంటామని.. వారందరికీ న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగాన్ని అచ్చెన్నాయుడు సందర్శించారు. త్వరితగతిన బాధితుల వివరాలు సేకరించి వారికి అండగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

Last Updated : Oct 12, 2021, 9:04 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details