శాసన మండలిలో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపకుండా అడ్డుకోవడం రాజ్యాంగ బద్ధమా అని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. న్యాయవ్యవస్థలపై చర్చ జరగాలన్న స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలపైభారత న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. మండలి రద్దు తీర్మానం చేసి తిరిగి అదే మండలికి సభ్యుడిని ఎలా ఎన్నుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పదవికి రాజ్యాంగం రక్షణ కోరుకోకుండా పక్కన పెట్టి సామాన్య పౌరుడిగా చర్చకు రండి... అంశాల వారీగా బహిరంగంగా చర్చిద్దాం అని స్పష్టం చేశారు.
బెదిరింపు వ్యాఖ్యలు...