ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CBN: జశ్వంత్ రెడ్డి ధైర్య సాహసాలకు వందనాలు: చంద్రబాబు - జవాను జశ్వంత్ రెడ్డికి చంద్రబాబు నివాళి

జమ్ముకశ్మీర్‌ ముష్కరుల కాల్పుల్లో.. గుంటూరు జిల్లాకు చెందిన జవాను జశ్వంత్ రెడ్డి మృతి చెందారు. జశ్వంత్ చూపిన ధైర్యసాహసాలకు వందనాలు అని తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. వారి కుటుంబానికి సంతాపం తెలిపారు.

tdp chief chandrababu naidu condolences to jawan jashwanth reddy
జశ్వంత్ రెడ్డి ధైర్య సాహసాలకు వందనాలు: చంద్రబాబు

By

Published : Jul 9, 2021, 8:12 PM IST

జమ్ముకశ్మీర్‌ ముష్కరుల కాల్పుల్లో గుంటూరు జిల్లా జవాను జశ్వంత్ రెడ్డి మృతి చెందారు. నిన్న రాజౌరి జిల్లా సుందర్బనీ సెక్టార్‌లో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో జశ్వంత్ రెడ్డి వీరమరణం పొందారు.

'జమ్మూ కాశ్మీర్​లో ఉగ్రవాదులపై జరిగిన పోరులో రాష్ట్రానికి చెందిన జవాను జశ్వంత్ రెడ్డి చూపిన ధైర్యసాహనాలకు వందనాలు' అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. 23ఏళ్ల వయస్సులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జశ్వంత్ రెడ్డికి.. సెల్యూట్ చేసే బృందంలో తాను చేరుతున్నట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు. జవాను కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details