ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీలో తాగునీటిపై పన్నుల మోత.. వచ్చే ఏప్రిల్‌ నుంచి పెంపు

పట్టణాల్లోని ప్రజలపై 2021 ఏప్రిల్‌ నుంచి తాగు, మురుగునీటి పన్నుల భారం పెరగనుంది. స్థానిక సంస్థలు స్వయం సమృద్ధి సాధించేందుకు వీలుగా నిర్వహణ ఖర్చులను పూర్తిగా వినియోగదారుల నుంచే వసూలు చేసుకునే స్వేచ్ఛను వాటికి ఇచ్చారు. ఈమేరకు యూజర్‌ ఛార్జీలను సవరిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి శ్యామలరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

By

Published : Nov 24, 2020, 7:37 AM IST

Updated : Nov 24, 2020, 9:17 AM IST

tap water rates hike
tap water rates hike

ఏప్రిల్ 2021 నుంచి పట్టణాల్లోని ప్రజలపై తాగు, మురుగునీటి పన్నుల భారం పెరగనుంది. ప్రస్తుతం విజయవాడలో తాగునీటి నిర్వహణ ఖర్చుల కింద ప్రతి ఏడాది 7% పన్ను పెంచుతున్నారు. ఇంత మొత్తంలో పెంచుతున్నా నిర్వహణకు సరిపడా ఆదాయం రావడం లేదని నగరపాలక సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. పూర్తి స్వయం సమృద్ధి సాధించేందుకు 15% వరకు ఛార్జీలను పెంచుకోవచ్చు. ఇదే అమలైతే నగరవాసులపై రెండింతల భారం పడే అవకాశముంది.

తాజా ఉత్తర్వుల ప్రకారం...

* తాగునీటి సరఫరా విభాగంలో ఇప్పటికే స్వయం సమృద్ధి సాధిస్తున్న సంస్థలు ప్రతి ఏటా 5% రుసుం పెంచుకోవచ్చు. ఈ పన్నులను గృహాలు, అపార్టుమెంట్లు, వాణిజ్య, పారిశ్రామిక కేటగిరీలుగా విభజించారు.

* ప్రస్తుతం ఉన్న యూజర్‌ ఛార్జీలను 15% వరకు పెంచుకోవచ్చు.

ఎన్ని మరుగుదొడ్లు ఉంటే... అంత పన్ను!

పట్టణాల్లో ప్రస్తుతం వసూలు చేస్తున్న మురుగునీటి పన్నులు.. నిర్వహణ ఖర్చుల కంటే తక్కువగా ఉన్నాయని, ఈ లోటును పూడ్చేందుకు వాటిని సవరించాల్సిన అవసరం ఉందని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి శ్యామలరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరుగుదొడ్ల (సీట్లు) కనెక్షన్‌ ఆధారంగా పన్నులను నిర్ణయించారు. పురపాలక, నగరపాలికల్లో తీర్మానం చేసుకొని, ప్రతి సంవత్సరం 5% పన్నులను పెంచుకునే అవకాశం కల్పించారు.

తాగునీటిపై పన్నుల మోత.. 2021 ఏప్రిల్‌ నుంచి 15% పెంపు!

ఇదీ చదవండి:నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి

Last Updated : Nov 24, 2020, 9:17 AM IST

ABOUT THE AUTHOR

...view details