తానా ఆధ్వర్యంలో జరిగిన 'మదర్స్ డే - అమ్మా నీకు వందనం' చరిత్ర సృష్టించింది. తానా సంస్థ ఆధ్వర్యంలో జిజ్ఞాస, జయహో భారతీయం, ఏపీ ఎన్ఆర్టీఎస్ సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ వర్చువల్ గ్లోబల్ కాంపిటీషన్స్-2020 రికార్డులు సృష్టించాయి.
చరిత్ర సృష్టించిన తానా.. 'మదర్స్ డే-అమ్మా నీకు వందనం'
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో ఈ ఏడాది వినూత్నంగా అంతర్జాలంలో నిర్వహించిన మదర్స్ డే 2020 వర్చువల్ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ లాక్ డౌన్ సమయంలో మదర్స్ డే వేడుకలు నిర్వహించాలన్న పట్టుదలతో తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి ప్రొత్సాహంతో నిర్వహించిన ఈ పోటీలు రికార్డు సృష్టించాయి.
tana mothers day celebrations created record
రెండు రోజుల పాటు..7 విభాగాల్లో పోటీలు జరిగాయి. వివిధ దేశాల నుంచి తెలుగు ప్రజలు దాదాపు 1850 మంది పాల్గొన్నారు. జూమ్ యాప్లో 100 మంది జడ్జీలతో 128 గంటలపాటు ఈ కార్యక్రమం జరిగింది. ఎక్కువ సేపు అంతర్జాలంలో నిర్వహించిన కార్యక్రమంగా 'ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్', 'ఇండియన్ వరల్ రికార్డ్' టైటిల్తోపాటు 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించింది.
ఇదీ చదవండి: విశాఖ హెచ్పీసీఎల్ రిఫైనరీలో పొగలు.. ఆందోళనలో ప్రజలు