ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 6, 2020, 3:42 PM IST

ETV Bharat / city

కరోనా పరీక్షల కోసం విద్యార్థుల నిరీక్షణ

విజయవాడ నగర శివారు అజిత్ సింగ్ నగర్ లోని కండ్రిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద... పాఠశాల విద్యార్థులు కరోనా పరీక్షల కోసం నిరీక్షిస్తున్నారు. కొవిడ్ పరీక్షలు నిర్వహించే సిబ్బంది రాకపోవటంతో విద్యార్థులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు.

students are waiting for corona tests in vijayawada
కరోనా పరీక్షల కోసం విద్యార్థుల నిరీక్షణ

విజయవాడ నగర శివారు అజిత్ సింగ్ నగర్ లోని కండ్రిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద... కండ్రిక సుబ్బారెడ్డి మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కరోనా పరిక్షల కోసం పడిగాపులు కాస్తున్నారు. పాఠశాలల పునఃప్రారంభం అనంతరం విద్యార్ధులకు కరోనా పరీక్షలు తప్పనిసరి అని అధికారులు ఆదేశించారు.

అయితే... విద్యార్థులకు స్ధానిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహిస్తారనే సమాచారంతో... వారంతా అక్కడకు చేరుకున్నారు. కానీ.. పరిక్షలు చేసే సిబ్బంది రాకపోవటంతో... విద్యార్థులు ఆరోగ్య కేంద్రం ముందు నిరీక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details