పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్లో స్టేషన్ ఓపెన్ హౌస్ను నిర్వహించారు. సీపీ బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ మేరీ ప్రశాంతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విధి నిర్వహణలో పోలీసులు వినియోగించే అన్ని రకాల ఆయుధాలను ప్రదర్శించారు. ఆపద సమయాల్లో ఆయుధాలను ఏ విధంగా వినియోగిస్తారో సందర్శకులకు తెలియజేశారు. బాంబులను నిర్వీర్యం చేసే పద్ధతిని బాంబు స్క్వాడ్ వివరించారు. మెటల్ డిటెక్టర్ ఏ విధంగా పనిచేస్తాయో తెలిపారు. డాగ్ స్వ్యాడ్ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
ఏఆర్ గ్రౌండ్స్లో స్టేషన్ ఓపెన్ హౌస్ ప్రారంభం - vijayawada latest news
విజయవాడ ఏఆర్ గ్రౌండ్స్లో స్టేషన్ ఓపెన్ హౌస్ను అడ్మిన్ డీసీపీ మేరీ ప్రశాంతి ప్రారంభించారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
![ఏఆర్ గ్రౌండ్స్లో స్టేషన్ ఓపెన్ హౌస్ ప్రారంభం station open house started in vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9277617-396-9277617-1603387364941.jpg)
వివిధ రకాల ఆయుధాలను ప్రజలకు చూపుతున్న పోలీసులు