రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆహ్వానం మేరకు ఇవాళ, రేపు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలలో ఏపీ ఎన్నికల పరిశీలకుడు, తెలంగాణా మాజీ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి పర్యటించనున్నారు. రేపు నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు మార్చి 10 తేదీన మున్సిపల్ ఎన్నికలు కూడా జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల పరిశీలకుడిగా వివిధ అంశాలను పరిశీలించనున్నట్టు తెలుస్తోంది.
కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో నాగిరెడ్డి పర్యటన! - Nagireddy latest news
కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఏపీ ఎన్నికల పరిశీలకుడు, తెలంగాణా మాజీ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఇవాళ, రేపు పర్యటించనున్నారు.
![కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో నాగిరెడ్డి పర్యటన! Nagireddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10708276-150-10708276-1613829606858.jpg)
నాగిరెడ్డి