ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆందోళన వద్దు.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది' - రైతు సమస్యలపై ఎంవీఎస్ నాగిరెడ్డి కామెంట్స్

లాక్​డౌన్ నేపథ్యంలో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మిషన్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయరంగంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టిసారించారని.. అన్నదాతలు ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు.

mvs nagireddy
రాష్ట్ర వ్యవసాయశాఖ మిషన్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి

By

Published : Apr 17, 2020, 3:06 PM IST

Updated : Apr 17, 2020, 3:24 PM IST

కరోనా కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మిషన్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని వ్యవసాయరంగంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టిసారించారని అన్నారు. పంటలకు మద్దతు ధర, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అన్ని అంశాలపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందని అన్నారు. ఈనెల 20 తర్వాత వ్యవసాయ రంగానికి మరిన్ని సడలింపులు ఉంటాయని పేర్కొన్నారు.

Last Updated : Apr 17, 2020, 3:24 PM IST

ABOUT THE AUTHOR

...view details