వైద్య విద్యసీట్ల భర్తీలో గందరగోళం నెలకొందని బీసీ సంఘాల నేతలు ఆరోపించారు. నిబంధనల ప్రకారం వైద్య విద్య సీట్ల భర్తీలో జీవో 550 అమలు చేయాలని...కానీ నిబంధనలను తొక్కిపెడుతున్నారని ఓబీసీ సంఘ అధ్యక్షులు డా. కె వేణుగోపాల్ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం, యూనివర్శిటీ అధికారులు దృష్టి సారించి బీసీ విద్యార్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
' సీట్ల కేటాయింపుల్లో నష్టపోయిన విద్యార్ధులకు న్యాయం చేయాలి' - వైద్య విద్య సీట్ల భర్తీలో గందరగోళం
వైద్య విద్యసీట్ల భర్తీలో నష్టపోయిన బీసి విద్యార్ధులకు న్యాయం చేయాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేయకపోతే తమ ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
బీసి విద్యార్ధులకు న్యాయం చేయాలి