ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'క్యాన్సర్ రోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం'

By

Published : May 28, 2020, 8:13 PM IST

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఎన్టీఆర్​ 97వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి నిత్యావసర సరకులు అందజేశారు.

'క్యాన్సర్ రోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం'
'క్యాన్సర్ రోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం'

తెలుగు జాతికి ఎనలేని సేవ చేసిన మహనీయుడు నందమూరి తారకరామారావు అని... బాలకృష్ణ కొనియాడారు. ఎన్టీఆర్ 97వ జయంతి సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్​ వర్కర్లు, 4వ తరగతి ఉద్యోగులకు నిత్యావసర సరకులను అందించారు.

కరోనా కష్టకాలంలోనూ బసవతారకం ఆస్పత్రి పూర్తిస్థాయిలో సేవలు అందించిందని తెలిపారు. క్యాన్సర్ రోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని బాలకృష్ణ భరోసా ఇచ్చారు.

ఇదీ చూడండి:'ఎన్టీఆర్... వ్యక్తి కాదు వ్యవస్థ'

ABOUT THE AUTHOR

...view details