ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నామినేషన్ల బలవంతపు ఉపసంహరణపై నివేదికలు ఇవ్వండి: ఎస్​ఈసీ

By

Published : Feb 18, 2021, 5:02 PM IST

Updated : Feb 19, 2021, 8:31 AM IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల బలవంతపు ఉపసంహరణపై ఈనెల 20లోగా కలెక్టర్లు, ఆర్‌వోలు నివేదికలు ఇవ్వాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్లు, ఏకగ్రీవాలపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. నామపత్రాల బలవంతపు ఉపసంహరణపై ఫిర్యాదులు అందాయని వ్యాఖ్యానించింది. కొందరిని నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని.. ఆధారాలతో వచ్చిన బాధితుల ఫిర్యాదులను కలెక్టర్లు పరిశీలించాలని ఎస్​ఈసీ స్పష్టం చేసింది.

నామినేషన్ల బలవంతపు ఉపసంహరణపై నివేదికలు ఇవ్వండి: ఎస్​ఈసీ
నామినేషన్ల బలవంతపు ఉపసంహరణపై నివేదికలు ఇవ్వండి: ఎస్​ఈసీ

గతేడాది వాయిదా పడిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభించేందుకు న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నట్టు... రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కొనసాగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 16వ తేదీన విజ్ఞప్తి చేసిందని తెలియచేసింది. నామినేషన్లు, ఏకగ్రీవాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్​కు కొన్ని ఫిర్యాదులు, అభ్యర్థనలు అందాయని ఎస్ఈసీ తెలియచేసింది.

పోటీలో ఉన్న అభ్యర్థుల నామినేషన్లను బలవంతంగా ఉపసంహరించేలా ఘటనలు జరిగినట్టుగా రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులందాయని ఎస్​ఈసీ స్పష్టం చేసింది. నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలకు సంబంధించి ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ల నుంచి నివేదిక కోరినట్టు వెల్లడించింది. ఫిబ్రవరి 20వ తేదీలోగా దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు కమిషన్ తెలిపింది. స్థానిక సంస్ధల ఎన్నికల్లో భాగంగా మున్పిపల్ ఎన్నికల ప్రక్రియ పునఃప్రారంభించినప్పుడు కమిషన్​అనూహ్యమైన స్పందన వచ్చిందని వెల్లడించింది.

బాధిత అభ్యర్థులు నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలకు సంబంధించిన ఆధారాలతో జిల్లా కలెక్టర్లను సంప్రదించాలని కోరింది. రిటర్నింగ్ అధికారులు, పోలీసుల వద్ద దాఖలు చేసిన ఫిర్యాదులు, మీడియాలో వచ్చిన కథనాలు తదితర ఆధారాలను సమర్పించాలని సూచించింది. దీనిపై తగిన ఆధారాలు లభ్యమైతే నామినేషన్లను పునరుద్ధరించే అధికారాలను కలెక్టర్లకు బదలాయించినట్టు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ తరహా ఘటనలపై నివేదికను ఫిబ్రవరి 20వ తేదీలోగా కమిషన్​కు సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వీటిని పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలకు కమిషన్ ఉపక్రమిస్తుందని ఎస్ఈసీ రమేశ్​కుమార్ వెల్లడించారు.

ఇదీ చదవండి:

భజరంగీ భాయిజాన్ లాంటిదే.. ఈ 'పర్సన్ జిత్' కథ!

Last Updated : Feb 19, 2021, 8:31 AM IST

ABOUT THE AUTHOR

...view details