ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ధ్రువీకరణ పత్రాలపై సీఎం ఫొటో తొలగించండి: ఎస్​ఈసీ

By

Published : Jan 30, 2021, 3:15 PM IST

ధ్రువీకరణ పత్రాలు, డ్యూ నోటిఫికేషన్లపై సీఎం జగన్ ఫొటో తొలగించాలని.. ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్​కు లేఖ రాశారు. ధ్రువీకరణ పత్రాలపై సీఎం ఫొటో ఉండటం ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు.

SEC orders to remove cm jagan photo on certificates due to conduct of panchayat elections
ధృవీకరణ పత్రాలపై సీఎం ఫోటో తొలగించండి: ఎస్​ఈసీ

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రాలు, వారు ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేరని నిర్ధారిస్తూ జారీ చేసే నో డ్యూ సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి జగన్ ఫొటోను తొలగించాలని.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్​కు శుక్రవారం లేఖ రాశారు. ఆ పత్రాలపై ముఖ్యమంత్రి సహా ఏ రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తుల ఫొటోలు ఉండటానికి వీల్లేదన్నారు. ధ్రువీకరణ పత్రాలపై సీఎం ఫొటో ఉండటం ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. దానిపై కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలిపాయని వివరించారు.

"ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఏ ఓటరుకైనా ఎలాంటి వివక్ష, జాప్యం లేకుండా ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా అధికారుల్ని ఆదేశించండి. అప్పుడే వారు సకాలంలో నామినేషన్లు వేయగలుగుతారు" అని రమేశ్ కుమార్ పేర్కొన్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకుని, ఆ విషయాన్ని ఎస్​ఈసీకి నివేదించాలని ఆదేశించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details