తిరుపతి పర్యటన ముగించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్..విజయవాడలోని తన కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం.. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తున్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు.