కరోనా నేపథ్యంలో పరిస్థితి కుదుటపడ్డాక ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముందన్న ఎస్ఈసీ జస్టిస్ కనగరాజ్ అభిప్రాయపడ్డారు. అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. సమయానికి అనుగుణంగా కార్యాచరణ, ప్రణాళికలు ఉండాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో కోడ్ కీలక భూమిక పోషిస్తుందన్న జస్టిస్ కనగరాజ్... స్థానిక ఎన్నికల వాయిదా, ఇతర అంశాలపై తొలిసారి సమీక్ష జరిపారు.
ఎన్నికలు ఎప్పుడైనా.. సిద్ధంగా ఉండాలి: జస్టిస్ కనగరాజ్ - ఎలక్షన్స్పై జస్టిస్ కనగరాజ్ కామెంట్స్ న్యూస్
స్థానిక ఎన్నికలకు అంతా సన్నద్ధంగా ఉండాలని నూతన ఎస్ఈసీ జస్టిస్ కనగరాజ్ స్పష్టం చేశారు. సమన్వయం చేసుకుంటూ విధుల్లో భాగస్వామ్యం కావాలని సిబ్బందికి సూచించారు.
![ఎన్నికలు ఎప్పుడైనా.. సిద్ధంగా ఉండాలి: జస్టిస్ కనగరాజ్ sec justice kanagaraj review on local elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6776782-35-6776782-1586777427888.jpg)
sec justice kanagaraj review on local elections