ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నాటుసారా స్థావరాలపై దాడులు.. నాలుగు రోజుల్లో 1,129 కేసులు - నాటుసారా స్థావరాలపై సెబ్ అధికారుల దాడులు

నాటుసారా స్థావరాలపై రాష్ట్రవ్యాప్తంగా సెబ్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నాలుగు రోజుల్లో 1,129 కేసులు నమోదు చేసి, 677 మందిని అరెస్టు చేసినట్లు సెబ్ అధికారులు వెల్లడించారు.

నాటుసారా స్థావరాలపై రాష్ట్రవ్యాప్తంగా సెబ్ అధికారుల దాడులు
నాటుసారా స్థావరాలపై రాష్ట్రవ్యాప్తంగా సెబ్ అధికారుల దాడులు

By

Published : Mar 15, 2022, 9:06 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాలపై రాజకీయ దూమారం రేగటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సెబ్ అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నారు.

ఆపరేషన్‌ పరివర్తన్‌లో భాగంగా నాలుగు రోజుల్లో 1,129 కేసులు నమోదు చేసి, 677 మందిని అరెస్టు చేశారు. 5.76 లక్షల లీటర్ల బెల్లపుఊటను ధ్వంసం చేశారు. 13,471 లీటర్ల నాటుసారా, 47 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details