ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆపరేషన్ నిఘా- అక్రమ రవాణాపై ఉక్కుపాదం - police ride on gatka centers in Kadapa

రాష్ట్రలో రోజురోజుకు పెరుగుతున్న అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఎస్​ఈబీ పోలీసులు 'ఆపరేషన్ నిఘా' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. రెండు రోజులపాటు జరిగిన ఈ ఆపరేషన్​లో భాగంగా అక్రమార్కులపై 1088 కేసులు నమోదు చేయడంతో పాటు 1537 మందిని అదుపులోకి తీసుకున్నారు.

seb launched operation nigha
ఆపరేషన్ నిఘా- అక్రమ రవాణాపై ఉక్కుపాదం

By

Published : Dec 7, 2020, 9:52 PM IST

రాష్ట్రంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు 'ఆపరేషన్ నిఘా' పేరుతో ఎస్​ఈబీ పోలీసులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ ఆపరేషన్​లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 269 బృందాలు పాల్గొన్నాయి. ప్రధానంగా మద్యం అక్రమ రవాణా, ఇసుక తవ్వకాలు, నిల్వలు, గుట్కా, గంజాయి వంటివాటిపై దృష్టి సారించాయి.

అక్రమ రవాణాపై ఉక్కుపాదం

ఈ ఆపరేష్​లో భాగంగా మొత్తం 1088 కేసులు నమోదు చేయడంతో పాటు 1537 మందిని అదుపులోకి తీసుకున్నారు. 192 వాహనాలు, 3,652 సీసాల లిక్కర్​ను స్వాధీనం చేసుకున్నారు. 530 కేజీల గంజాయి, 349 టన్నుల ఇసుక, రూ. 45 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నారు. పేకాట శిబిరాలపై దాడులు చేశారు. తనిఖీల్లో రూ. 24 లక్షల నగదు, అక్రమంగా రవాణా చేస్తున్న 1.5 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురంలో..
అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని తనకల్లు పోలీసులు అరెస్టు చేసి 56 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. తనకల్లు మండలం గుర్రం బయలులో మద్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

కడపలో..

వేంపల్లిలో గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసి.. 2080 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.45 వేలు ఉంటుందన్నారు. అక్రమంగా విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో పట్టణంలో నాగార్జున అనే వ్యక్తితో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. గుట్కా ప్యాకెట్లు సరఫరా చేసే మరొక వ్యక్తి పరారీలో ఉన్నట్లు సీఐ వెల్లడించారు.

ఇదీ చదవండి :

ఆకతాయిల ఆగడాలు.. వెకిలిమాటలతో యువతులకు వేధింపులు

ABOUT THE AUTHOR

...view details