ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు: ఆర్టీసీ ఎండీ ఠాకూర్‌

విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌లో.. ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ ఆకస్మిక తనీఖీ చేశారు. దుకాణాల్లో ఎమ్మార్పీకి మించి ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. హెచ్చరించారు. ఎరైవల్‌, డిపార్చర్‌, సిటీ బస్‌ టెర్మినల్‌, కార్గో, కొరియర్‌ కౌంటరు, డెలివరీ పాయింట్లను పరిశీలించారు.

By

Published : Feb 5, 2021, 7:59 AM IST

Published : Feb 5, 2021, 7:59 AM IST

rtc md rp takur sudden inspection at vijayawada bus station
అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు: ఆర్టీసీ ఎండీ

బస్​స్టాండ్లలోని దుకాణాల్లో ఎమ్మార్పీకి మించి ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దని.. దుకాణదారులను.. ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌ హెచ్చరించారు. విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టేషన్లో ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఎరైవల్‌, డిపార్చర్‌, సిటీ బస్‌ టెర్మినల్‌ చూశారు. మొదటి అంతస్తులో ఉన్న డార్మెటరీలను పరిశీలించారు. పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అక్కడే ఉన్న క్యాంటీన్‌ను, మరుగుదొడ్లు, ప్లాట్‌ఫారాలను పరిశీలించారు. అనంతరం సిటీ పోర్ట్‌కు వెళ్లి ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్గో, కొరియర్‌ కౌంటరు, డెలివరీ పాయింట్లను పరిశీలించారు. ఎరైవల్‌ బ్లాక్‌లో ఉన్న మినీ థియేటర్‌ను తిరిగి తెరిచేందుకు టెండర్లు పిలవాలని సూచించారు. బస్టాండులో ఖాళీగా ఉన్న దుకాణాలను త్వరగా నింపాలని, ఆదాయం వచ్చే అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సజ్జలతో ఠాకూర్ భేటీ

ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ మర్యాదపూర్వకంగా కలిశారు. సజ్జల నివాసానికి వెళ్లిన ఠాకూర్.. ఆర్టీసీ సహా ఇతర అంశాలపైనా చర్చించారు.

ఇదీ చదవండి:

పోలవరంపై ఎంపీ గల్లా ప్రశ్న... కేంద్ర మంత్రి సమాధానం

ABOUT THE AUTHOR

...view details