ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు వద్ద బస్సు బోల్తా.. పలువురు మృతి - ap latest news

Road accident at andhra karnataka border
ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు వద్ద ఘోర ప్రమాదం

By

Published : Mar 19, 2022, 10:11 AM IST

Updated : Mar 19, 2022, 11:06 AM IST

10:08 March 19

క్షతగాత్రులకు తుముకూరులోని ఆస్పత్రిలో చికిత్స

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు వద్ద ఘోర ప్రమాదం

Road accident: ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని వై.ఎన్‌.హొసకోట నుంచి పావగడకు వెళ్తున్న ప్రైవేటు బస్సు బోల్తాపడటంతో ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో పలువురు మరణించారు. సుమారు 10 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను తుముకూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు బోల్తా పడే సమయంలో.. పలువురు బస్సు పైనుంచి కిందకు దూకారు. మృతుల్లో ఎక్కువమంది బస్సు పైనుంచి దూకినవారే ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో.. బస్సులో 40 మంది ప్రయాణికులు.. బస్సు టాప్​ పైనా కూడా పలువురు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:

VOA Nagalakshmi suicide : ఆమె ఆత్మహత్య చేసుకుంటే గానీ.. నిందితుడి అరెస్టు లేదు!

Last Updated : Mar 19, 2022, 11:06 AM IST

ABOUT THE AUTHOR

...view details