ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాతావరణం: రానున్న 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా ఉపరితల ద్రోణి ఆవరించడంతో రానున్న 24 గంటల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, పిడుగులతో కూడిన చిరుజల్లులు, ఈదురు గాలులు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

By

Published : Apr 21, 2021, 8:15 PM IST

rains across state in 24 hours
రానున్న 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వానలు

కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కోస్తాంధ్ర వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల వ్యవధిలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఆకాశం మేఘావృతం..

ఇవాళ, రేపు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వెల్లడించింది. చాలాచోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని స్పష్టం చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలియజేశారు.

ఉరుములతో కూడిన జల్లులు..

ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

పిడుగులతో పాటు గాలులు..

కృష్ణా, నెల్లూరు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయని, గాలుల తీవ్రత కూడా గంటకు 40 కిలోమీటర్ల వరకూ ఉండవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇవీ చదవండి:

రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం

ఆ నాలుగు రాష్ట్రాల్లో.. అందరికీ టీకా ఉచితంగానే

ABOUT THE AUTHOR

...view details