Railway Platform Ticket Rates: రైల్వే స్టేషన్లో అనవసర రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ప్లాట్ ఫాం టికెట్ ధరలను పెంచింది. ఈ పెంపు శుక్రవారం నుంచే అక్టోబర్ 9 వరకు అమలులో ఉండనుంది. దసరా రద్దీ దృష్ట్యా.. అనవసర రద్దీని తగ్గించేందుకు తాత్కాలికంగా ప్లాట్ ఫాం ధరలను రైల్వే అధికారులు పెంచారు. పెంచిన ప్లాట్ ఫాం ధరలను రూ.10 నుంచి రూ.30 వరకు పెంచాయి.
పండగ ఎఫెక్ట్.. రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధర పెంపు - దసరా రద్దీ
Railway: దసరా పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు రైల్వే ప్లాట్ ఫాం టికెట్ ధరను పెంచారు. తాత్కాలికంగా ఈ ధరలను అధికారులు పెంచారు. శుక్రవారం నుంచే పెంచిన ధరలు అమలులోకి రానున్నాయి.
![పండగ ఎఫెక్ట్.. రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధర పెంపు Platform Ticket Rates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16510614-286-16510614-1664471981318.jpg)
ప్లాట్ ఫాం టికేట్
విజయవాడ రైల్వే స్టేషన్లో గతంలో 10 రూపాయలు ఉంటే ప్రస్తుతం 30కి పెంచారు. గుంటూరులో 10 రూపాయల నుంచి 20కి పెంచారు. ఈ పెంచిన ధరలు ఈ నెల 30 నుంచి అక్టోబర్ 9 వరకు మాత్రమే అమలులో ఉంటాయి. సొంత ఊర్లకు వెళ్లే వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు.. ప్లాట్ ఫాంపైన రద్దీని నియంత్రించేందుకు ఈ ధరలు పెంచినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు పెంచిన ధరలకు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.
ఇవీ చదవండి: