భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరు జిల్లాలోని షార్ మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఏప్రిల్ 1న పీఎస్ఎల్వీ-సీ 45 వాహన నౌక.. డీఆర్డీవోకి చెందిన ఎలక్ట్రానిక్ ఇంటిలిజెన్స్ శాటిలైట్తోపాటు... విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇప్పటికే రాకెట్లో ఉపగ్రహాలను అనుసంధానం చేసిన శాస్త్రవేత్తలు... వ్యాబ్లో పీఎస్ఎల్వీ-సీ 45ను అనుసంధానం చేశారు. నేడు రాకెట్ సన్నద్దత, లాంచ్ అథరైజేషన్పై సమావేశం జరగనుంది. రేపు ఉదయం 5 గంటల 27 నిమిషాలకు కౌంట్డౌన్ ప్రారంభిస్తామన్న శాస్త్రవేత్తలు... ఏప్రిల్ ఒకటో తేదీ ఉదయం 9 గంటల 27 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ 45 నింగిలోకి దూసుకెళ్తుందని ప్రకటించారు. పీఎస్ఎస్వీ-సీ 45 వాహన నౌక, ఉపగ్రహాలను 3వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశ పెట్టనుంది. సముద్ర జలాలపై ప్రయాణించే నౌకల సమాచారం సేకరణ, నూతన సాంకేతికత పరిశోధనకు ఈ ప్రయోగం దోహదపడనుంది.