ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Protest: ఆర్టీసీ కారుణ్య నియామకాల్లో అన్యాయం జరుగుతోందంటూ ఆందోళన

కారుణ్య నియామకాలలో అన్యాయం జరుగుతోందంటూ ఆర్టీసీలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. సీనియారిటీ ప్రకారం కాకుండా అక్రమంగా నియామకాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ.. విజయవాడ పండిట్ నెహ్రూ బస్​స్టేషన్​లోని ఆర్టీసీ ఎండీ కార్యాలయం ఎదుట విధుల్లో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.

By

Published : Feb 14, 2022, 2:19 PM IST

Published : Feb 14, 2022, 2:19 PM IST

ఆర్టీసీ కారుణ్య నియామకాల్లో అన్యాయం జరుగుతోందంటూ ఆందోళన
ఆర్టీసీ కారుణ్య నియామకాల్లో అన్యాయం జరుగుతోందంటూ ఆందోళన

కారుణ్య నియామకాలలో అన్యాయం జరుగుతోందంటూ ఆర్టీసీలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్​స్టేషన్​లోని ఆర్టీసీ ఎండీ కార్యాలయం ఎదుట విధుల్లో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. సీనియారిటీ ప్రకారం కాకుండా అక్రమంగా నియామకాలు చేపడుతున్నారని ఆరోపించారు.

2016-19 మధ్య విధుల్లో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు కాకుండా 2020-21 వారికి ముందు ఉద్యోగాలు కల్పిస్తున్నారన్నారు. 2016-19 మధ్య కారుణ్య నియామకం పొందవలసిన వాళ్లు 725 మందికిపైగా ఉన్నారని ఆందోళనకారులు చెబుతున్నారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన పోలీసులతో కారుణ్య నియామక ఉద్యోగార్థులు వాగ్వాదానికి దిగారు.

ABOUT THE AUTHOR

...view details