సీపీఎస్ రద్దుపై ఆగస్టు చివరిలోగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుంటే సెప్టెంబర్ 1న విజయవాడలోని ధర్నాచౌక్లో ఉద్యోగుల ఆవేదన పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపడతామని ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రతాప్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించిన జగన్... 15 నెలలు గడిచినా హామీ నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా సీపీఎస్ రద్దు నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారు.
సీపీఎస్ రద్దుకు సెప్టెంబర్ 1న నిరసన - సీపీఎస్ రద్దు వార్తలు
సీపీఎస్ రద్దుపై ఆగస్టు చివరిలోగా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రతాప్ డిమాండ్ చేశారు. అప్పటికి స్పష్టత ఇవ్వకపోతే సెప్టెంబర్ 1న విజయవాడలోని ధర్నాచౌక్లో ఉద్యోగుల ఆవేదన పేరుతో నిరసన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

సీపీఎస్ రద్దుకు సెప్టెంబర్ 1న నిరసన