ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో చేపట్టిన నిరసన దీక్ష రెండో రోజుకు చేరింది. దీక్షా శిబిరాన్ని పలువురు రాజకీయ నాయకులు, దళిత, ప్రజా సంఘాల నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. వైకాపా అధికారంలోకి వచ్చాక వెనుకబడిన వర్గాల ప్రజలపై భౌతిక దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ఇతర పథకాలకు మళ్లించారని మండిపడ్డారు.