విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కొవిడ్ ఐసోలేషన్ కేంద్రంలో 8 నెలల గర్భిణీ నేలపై పడి చనిపోయి 3 గంటలు దాటినా ఎవ్వరూ స్పందించక పోవటం దారుణమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన రోగి వీడియోను ఇతర రోగులు చిత్రీకరించారని.., ఆ దృశ్యాలు తనను ఎంతో కలచి వేశాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
గర్భిణీ నేలపై పడి చనిపోయినా పట్టించుకునే వారే లేరు: చంద్రబాబు - chandrababu responded on pregnant lady died vijawada news
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని కొవిడ్ ఐసోలేషన్ కేంద్రంలో దారుణం జరిగింది. గర్భిణీ నేలపై పడి చనిపోయి 3 గంటలు దాటినా ఎవరూ స్పందించలేదు. చనిపోయిన రోగి వీడియోను ఇతర రోగులు చిత్రీకరించిన దృశ్యాలు తనను ఆవేదనకు గురి చేశాయంటూ చంద్రబాబు ట్విట్టర్ లో పోస్టు చేశారు.
![గర్భిణీ నేలపై పడి చనిపోయినా పట్టించుకునే వారే లేరు: చంద్రబాబు pregnant died in kovid isolation center](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8129110-335-8129110-1595419709984.jpg)
గర్భిణీ నేలపై పడి చనిపోయి 3 గంటలు దాటినా ఎవరూ స్పందించలేదు: చంద్రబాబు
గర్భిణీ నేలపై పడి చనిపోయి 3 గంటలు దాటినా ఎవరూ స్పందించలేదు: చంద్రబాబు
దీనికి సంబంధించిన వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. గర్భిణీ వాంతులు చేసుకుని చనిపోయిందని, ఇంకా ఆమెకు సహాయం చేయడానికి సిబ్బంది రాలేదంటూ... తోటి రోగులు బాధపడుతూ ఈ వీడియో పెట్టారన్నారు. ఈ దృశ్యాలు ఎంతో భయంకరంగా, దయనీయంగా ఉన్నాయని పేర్కొన్నారు.