ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యజమాని ఇంటికి కన్నం... రూ.50 లక్షలు చౌర్యం - విజయవాడ నేర వార్తలు

విజయవాడలో ఆయుర్వేద వైద్యుని ఇంట్లో చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆసుపత్రిలో పనిచేసే వారే చోరీకి పథకం వేశారని పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని... వారి నుంచి కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

theft in vijayawada
theft in vijayawada

By

Published : Sep 16, 2020, 10:22 PM IST

విజయవాడలోని ఆయుర్వేద వైద్యుని ఇంట్లో జరిగిన 50 లక్షల చోరీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆసుపత్రిలో పీఆర్​వోతో పాటు గతంలో పనిచేసిన వ్యక్తి కలిసి చోరీకి పథకం వేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటివరకు ఈ కేసులో 40 మందిని విచారించినట్లు తెలుస్తోంది.

దోపిడీకి పాల్పడిన నలుగురు వ్యక్తులు తాడేపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని... వారి నుంచి కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details